వనపర్తిలోని మరెమ్మకుంట దర్గా దగ్గర ఉన్న సమాధులను ఆక్రమించి ప్లాట్లు చేస్తున్నారని ముస్లిం నేతలు షేక్ జహంగీర్, మోహియొద్ధిన్,జావిద్,గులాం ఖాదర్,మైసన్, టిఆర్ఎస్ లతిఫ్ తెలిపారు. వనపర్తి తహశీల్దార్ రాజేందర్ గౌడుకు పిర్యాదు చేశారు. సమాధులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్కడ పూర్వ కాలం నుండి ముస్లింల సమాధులు ఉన్నాయని,కంచె ఏర్పాటు చేయాలని కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్