37.2 C
Hyderabad
May 2, 2024 12: 09 PM
Slider ప్రత్యేకం

బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీహార్ కు చెందిన ముస్లిం కార్మికులు

#ministermuhammadmahmoodali

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లౌకిక వాదిగా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం వల్ల పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు హోం మంత్రి సమక్షంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో బీహార్ నుండి వివిధ పార్టీలకు చెందిన యాభై మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు దేశంలోనే ప్రముఖ స్థానం కల్పించారని , దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహోరాత్రులు కృషి చేస్తున్నారన్నారు.నిత్యం ప్రజల సేవల్లో పార్టీ నిమగ్నమై ఉంటుందని మంత్రి తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు నిరంతరం బి ఆర్ ఎస్ పార్టీలో చేరడానికి ఇదే కారణమని, ఈ పార్టీలో అన్ని మతాల వారిని సమానంగా చూస్తామన్నారు. తమ తమ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, సేవకు నడుం బిగించాలని పార్టీలో చేరిన కార్యకర్తలకు సూచించారు.సామాజిక శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని హోం మంత్రి వారిని కోరారు.

Related posts

ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన బాబాయ్

Satyam NEWS

జ‌న‌సేన క్రియాశీల‌క స‌భ్య‌త్వం

Sub Editor

లియోనియా కార్మికులకు అండగా ఉంటా

Satyam NEWS

Leave a Comment