38.2 C
Hyderabad
April 29, 2024 20: 12 PM
Slider కడప

జ‌న‌సేన క్రియాశీల‌క స‌భ్య‌త్వం

Janasena

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో క‌డ‌ప జిల్లా న‌గ‌ర జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షుడు మాలే శివ, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ నాయకుల అవినీతి, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయ‌న్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగాయ‌న్నారు. సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏపీలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ సంబరాలకు అడ్డురాని కరోనా స్థానిక సంస్థలకు మాత్రం అడ్డురావడంలో అంతర్యమేమీటో అర్థం కావడం లేద‌న్నారు.

పక్క రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు, నిర్వ‌హిస్తున్నారు. కానీ త‌మ రాష్ర్టంలో మాత్రం ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని, ప్రభుత్వం చేస్తున్నతప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

శ్రీకాళహస్తి లో జనసేన మహిళా నేత వినూత ఇంటిపై జరిగిన దాడిని సుంక‌ర తీవ్రంగా ఖండిచారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సభ్యత్వం తీసుకున్నప్రతి కార్యకర్తకు భీమా సౌకర్యం ఉంటుంద‌న్నారు. ఇలాంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఏ పార్టీ చేపట్టలేద‌ని సుంక‌ర పేర్కొన్నారు.

Related posts

ధర్మ ఛత్రం

Satyam NEWS

పాండిచ్చేరి స్వతంత్ర అభ్యర్ధి కాకినాడలో అపస్మారక స్థితిలో…

Satyam NEWS

కనకంబొట్ల వేంకటేశ్వర శర్మ కు ఘన నివాళులు

Satyam NEWS

Leave a Comment