తిరుపతి నగరపాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువన్ కుమార్ రెడ్డి మాజీ మునిసిపల్ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి తో కలసి శనివారం గాంధీ రోడ్డు, పి పి చావడి, చిన్న బజార్ వీధులలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు.
ప్రతి ఓటర్ వద్దకు వెళ్లి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 28 వ డివిజన్ లో ఏ సమస్య ఉన్నా ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లోని అన్ని వీధులలో తాగునీటి సమస్య రాకుండా అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు మునిరత్నం శెట్టి, రమణ,వెంకట ముని, శ్రీనివాసులు,మహమ్మద్, రామచంద్రయ్య శెట్టి, కుమార్, గౌరీ, రాహుల్, వాసు, రవి తదితరులు పాల్గొన్నారు.