27 ఏళ్ల తర్వాత కలసిన స్నేహితులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఉన్నత పాఠశాల 1995,96 వ సంవత్సరం పదో తరగతి విద్యార్థిని విద్యార్థుల పూర్వ సమ్మేళనం
కన్నుల పండువగా జరిగింది. సుమారు వంద మందికి పైగా అప్పటి విద్యార్థిని విద్యార్థులు ఈ సమ్మేళననికి హాజరయ్యారు. తమకు చదువు బోధించిన ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పుకుంటూ సరదాగా గడిపారు.