కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో కమిటీలో తనను సభ్యునిగా నియమించడంలో సహకరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి మువ్వా విజయబాబు కృతజ్ఞతలు తెలిపారు. పొంగులేటిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ పదవికి చిత్తశుద్ధితో పనిచేసి న్యాయం చేకూరుస్తానని ఈ సందర్భంగా మువ్వా విజయబాబు పేర్కొన్నారు.