38.2 C
Hyderabad
May 3, 2024 20: 46 PM
Slider ఆదిలాబాద్

ట్రైబ్స్ ఫెస్ట్:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

nagoba jatara tribals fest

ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్‌లో గ్రామంలోవైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో మహాపూజలకు శ్రీకారం చుట్టారు.

పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్‌ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన ఆలయంలో ఉంచిన నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా నాగోబా ఆలయానికి తరలించారు.కెస్లాపూర్‌ నుంచి నాగోబా విగ్రహాన్ని తీసుకొస్తున్న మెస్రం వంశీయులను మర్రిచెట్లకు వెళ్లేదారిలో మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు.మెస్రం వంశీయులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తుజనంతో నాగోబా ఆలయం కిక్కిరిసిపోయింది.

Related posts

ప్రభుత్వం రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటు

Satyam NEWS

ఐఐటీ, నీట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన భూమన

Satyam NEWS

‘ ఫ్లై హై టూరిజం’ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి

Bhavani

Leave a Comment