ఉప్పల్ నియోజకవర్గంలోని నాగోల్ మెట్రోస్టేషన్ సమీపంలో డంపింగ్ యార్డు తరలించాలని ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్ యార్డు ఉండటం వలన అక్కడ వేసే చెత్త చెదారం వల్ల విపరీతమైన దుర్గంధం వలన ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ సమస్యను జిహెచ్ఎమ్సీ వారు రాంకీ సంస్థ చే అత్యాధునిక విధానంలో ఏర్పాటు చేసి డంపింగ్ ను తరలించినట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్కు వచ్చే ప్రయాణికులు , పరిసర ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతోంద ఎమ్మేలే ప్రస్తావించారు. అందుకుగాను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ విషయాన్ని నోట్ చేసుకుని పరిశీలిస్తామన్నారు.
previous post