బాధిత కుటుంబాలకు సాయం అందించి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ములుగు జిల్లా మాన్ సింగ్ తండ గ్రామానికి చెందిన జాటోత్ అచ్చు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే గ్రామానికి చెందిన గుగులోత్ కోతీయా మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని వారు లేని లోటును ఎవరు తీర్చలేరని తస్లీమా అన్నారు.
సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందించారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్, రాసమల్ల హేమంత్, చంటి అనిల్, భాను ప్రకాష్, రవీందర్, ప్రతాప్,తిరుపతి,యాకూబ్, నరేష్, మధు ,ప్రదీప్,నరేందర్, నవీన్ తదితరులు ఉన్నారు.