28.7 C
Hyderabad
April 28, 2024 06: 13 AM
Slider ముఖ్యంశాలు

పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయాలి

#warangalpolice

ప్రజలు పోలీసులపై వుంచిన నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహించి ప్రజల అభిమానాన్ని పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్  పోలీస్ అధికారులకు సూచించారు.

పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన  అనంతరం తొలిసారిగా  మట్వాడ పోలీస్  స్టేషన్ ను సందర్శించారు. ఈ రోజు సాయంత్రం  మట్వాడ పోలీస్ స్టేషన్ కు చెరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా మట్వాడ పోలీస్ స్టేషన్  ప్రాంగణంలోని ట్రాఫిక్, సిసి ఎస్.క్రైం పోలీస్ స్టేషన్ల తో పాటు వరంగల్ ఏసిపి కార్యాలయాలు మరియు స్టేషన్ పరసరాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పరిసరాలను పరిశుభ్రంగా వుంచడంతో పాటు మొక్కల పెంపకం చెపట్టాలని, అధే విధంగా వివిధ కేసుల్లోని దిచక్ర వాహనాలను వాటి యజమానులకు అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత స్టేషన్  అధికారులను అదేశించారు.

అనంతరం మట్వాడ పోలీస్  స్టేషన్ రిసెప్షన్ పనితీరును సంబంధిత విభాగం మహిళ సిబ్బందిని అడిగి తెలుసుకోవడం మరియు స్టేషన్  టెక్ విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు.చివరగా పోలీస్ స్టేషన్ లో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు నేరాల నియంత్రణ , నేరస్థులపై నిఘా పై , సిసి కెమెరాల ఎర్పాటు, వర్టికల్స్ విధానంతో పోలీసుల అధికారులు విధులు నిర్వహిస్తున్న తీరుపై పోలీస్ కమిషనర్ అరా తీసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్  అధికారులతో పోలీస్ స్టేషన్  ప్రాంగణంలో మొక్క నాటారు.

పోలీస్ కమిషనర్  వెంట సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి , ఎసిపిలు గిరికుమార్,బాబురావు, మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గణేష్  మరియు ట్రాఫిక్ , సిసి ఎస్. విభాగాలకు చెందిన ఇన్స్‌పెక్టర్లు నరేష్ కుమార్, రమేశ్ కుమార్ వున్నారు.

Related posts

వనపర్తి జిల్లా సగర మహిళా నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి విశిష్టత

Satyam NEWS

Leave a Comment