కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో తీసుకుంటున్న జాగ్రత్తలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు. హాస్పిటల్ కు వచ్చే పెషెంట్లను భవనంలోనికి ప్రవేశించడానికి ముందుగా స్క్రీనింగ్ చేయడానికి అక్కడ ఉన్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం హాస్పిటల్ లోకి ప్రవేశించే వారి కోసం ఏర్పాటు చేసిన శానిటైజేషన్ సౌకర్యాలు పరిశీలించారు. అలానే పేషెంట్ తో పాటు వచ్చిన వారు వేచి ఉండడానికి చేసిన ఏర్పాట్లపై చర్చించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సీఈవో, డా. ఆర్ వి ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్ డా. టియస్ రావులు కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు జాగ్రత్తలను వివరించారు.