పరిక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ను పరిశీలించిన పోలీసు బాస్ దీపికా…!
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో జరుగుతోంది. ఈ మేరకు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట మైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తోంది…పోలీసు శాఖ పరీక్ష మొదలయ్యే ముందు… విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలు పోలీసు స్టేషన్ లలో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు కై కేటాయించిన సిబ్బంది తో సంబంధిత సర్కిల్స్ లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం కూడా నిర్వహించిన తీసుకోవలసిన జాగ్రత్తలను సిబ్బందికి గుర్తు చేసారు. ఇక విజయనగరం లో జేఎన్టీయూ, సీతం కాలేజ్…ఏజీఎల్ ఇలా సెంటర్లగా కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఎస్పీ దీపికా ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు.
ఇక జిల్లా కేంద్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక, స్వయంగా సందర్శించి, పరీక్ష కేంద్రాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, భద్రత సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేసారు .జిల్లా ఎస్పీ వెంట వెంట డీఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, వీరకుమార్, ఎల్.శేషాద్రి, సిఐలు శ్రీ టివి తిరుపతిరావు, సీహెచ్.లక్ష్మణరావు, బి.వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు..