కామారెడ్డి మండల పరిషత్ అధ్యక్షునిగా వైస్ ఎంపీపీ ఉరుదొండ నరేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు విదేశీ పర్యటనలో ఉండటంతో నేడు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో వైస్ ఎంపీపీ నరేష్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరేష్ కు విప్ గంప గోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. విప్ గంప గోవర్ధన్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దీన్ నరేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
previous post