29.7 C
Hyderabad
April 29, 2024 10: 46 AM
Slider నిజామాబాద్

ఇంచార్జి ఎంపీపీగా ఉరుదొండ నరేష్

#gampagovardhan

కామారెడ్డి మండల పరిషత్ అధ్యక్షునిగా వైస్ ఎంపీపీ ఉరుదొండ నరేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు విదేశీ పర్యటనలో ఉండటంతో నేడు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో వైస్ ఎంపీపీ నరేష్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరేష్ కు విప్ గంప గోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. విప్ గంప గోవర్ధన్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దీన్ నరేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Satyam NEWS

వరదల సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగం సేవలకు సెల్యూట్

Satyam NEWS

నిరాశా నిస్పృహలతోనే టీఆరెఎస్ కార్యకర్తల పై దాడులు

Bhavani

Leave a Comment