25.2 C
Hyderabad
May 13, 2024 10: 59 AM
Slider కరీంనగర్

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు నాయి బ్రాహ్మణ కులస్తుల మద్దతు

#gangulakamalakar

బీసీ కులాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్  సిటీ సెంటర్  హాల్ మందిరంలో నాయి బ్రాహ్మణు కులస్తుల, ఆత్మీయ సమ్మేళన  సమావేశం  జరిగింది. ఈ సమావేశానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కులవృత్తులకు జీవం పోసి ..అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని. అడగకుండానే వరాలు కురిపించే దేవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన గెల్లు శ్రీనివాస్ కు  ఓటు వేయడం తో పాటు… నియోజకవర్గంలో ని ప్రతి గ్రామానికి వెళ్లి ..ఒక్క ఓటు కారిపోకుండా …బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం  కృషి చేస్తున్న  తెలంగాణ ప్రభుత్వం కొరకు  ఓట్లు వేయడం తో పాటు తమ సెలూన్ లకు వచ్చే కష్టమర్లకు  ప్రభుత్వ పని తీరు వివరించి ఓట్లు వేయించి  మద్దతు కూడగట్టాలని  నాయి బ్రాహ్మణులకు విన్నవించారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచిందని నాయ బ్రాహ్మణులకు వ్యక్తిగత రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు… బీసీలంతా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు

హుజరాబాద్ పట్టణ అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో పాటు ఉ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని పనులన్నీ చురుకుగా కొనసాగుతున్నాయని రానున్న రోజుల్లో హుజరాబాద్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతమని అన్నారు.

ఈటల తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి హుజురాబాద్ ను  మాత్రం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా ఈటల విఫలమయ్యారని .. నియోజకవర్గంలోని బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కారని..పేర్కొన్నారు. ఈటల పాదయాత్ర దేనికోసం చేస్తున్నాడని ప్రజలు ఎదురు తిరుగాలని అన్నారు. హుజురాబాద్ పట్టణం నాయిబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి 10 గంటల  భూమి తో పాటు నిర్మించుకోవడానికి నిధులు కూడా మంజూరు చేసిందని వెల్లడించారు… త్వరలో భూమి పూజ చేసుకుంటామని అన్నారు…

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు సూరంపల్లి మనయ్య.. బండారు శ్రీనివాస్, కొత్తగట్టు చక్రపాణి, తిప్ప బతిని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

చీరాలలో వివాహితను నరికి చంపిన కిరాతకులు

Satyam NEWS

ఏపిలో రాజకీయ పునరేకీకరణకు ఇది లాంగ్ మార్చ్

Satyam NEWS

బాలివుడ్ ఛాన్సు కొట్టేసిన రష్మిక

Satyam NEWS

Leave a Comment