సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 16వ,వార్డులో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి నిధుల నుండి మంజూరైన 5 లక్షల రూపాయలతో బుధవారం డ్రైనేజీ పనులకు మున్సిపల్ కౌన్సిలర్ కారింగుల విజయలక్ష్మి వెంకన్న గౌడ్ శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ నేడు హుజూర్ నగర్ పట్టణం అభివృద్ధి చెందిందంటే అది కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క కృషితోనే అన్నారు.8 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్,కౌన్సిలర్లు రాజా నాయక్,కోతి సంపత్ రెడ్డి,సరిత వీరారెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ కుమార్ గౌడ్,జక్కుల మల్లయ్య,చింతకాయల రాము, వాసుదేవరావు,హరిబాబు,పి.రామ్మూర్తి,పి. రామరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్