38.2 C
Hyderabad
May 2, 2024 19: 39 PM
Slider విశాఖపట్నం

భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మరో కొత్త డ్రామా…! 

#janasena

జగన్ ప్రభుత్వ హాయాంలో ఏ ఒక్క టి క్షేత్ర స్థ అమలవుతుందన్న నమ్మకం లేదని విజయనగరం జనసేన పార్టీ నేత ,ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు అన్నారు. ఈ మేరకు విజయనగరం లో అంబటి సత్రం వద్ద ఇటీవలే మనుగడ లోకి వచ్చిన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యలు మాట్లాడారు. ఈ భోగాపురం ఏర్ పోర్ట్ ఓ కొత్త డ్రామా అని అన్నారు.

నిజంగా భోగాపురం విమానాశ్రయం నిర్మించే ఉద్దేశ్యమే ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి నిర్మాణం పూర్తయి ఉండేదన్నారు. విజయనగరం కి త్రాగునీరు ,నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరందించే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ ప్రారంభించిన రామతీర్ధ సాగర్‌ ప్రాజెక్టును  ఎందుకు  పూర్తి చేయలేకపోయారని అయ్యలు ప్రశ్నించారు. జిల్లాలోని పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయినా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు సొంత డబ్బులతో నిర్మించుకున్న ఇళ్ళకి స్టిక్కర్లు అంటించే అధికారం ఎవరూ ఇచ్చారు ? అంటూ ప్రశ్నించారు.

ప్రజలు కట్టిన పన్నులు , అద్దెలతో ఎప్పుడు విజయనగరం కార్పొరేషన్ ఆర్ధికంగా బలంగా వుంటుంది. ఆ నిధులతో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా అభివృద్ధి పనులు చేస్తారు….అది సర్వ సాదరణం…స్థానిక ఎమ్మెల్యే స్వామి మాత్రం …ఆ నిధులు ఆయన ఎక్కడి నుండో తీసుకువచ్చి పనులు చేస్తున్నట్టు షో చేస్తున్నారు…..రాష్ట్ర ప్రభుత్వం నుండి విజయనగరం నియోజకవర్గానికి ఆయన ఏమైనా నిధులు తీసుకుని వచ్చి పనులు చేయించారా అని నిలదీశారు  గ్రామాల్లో ఎందుకు శంకుస్థాపనలు పెట్టడం లేదంటే…పంచాయితీల్లో నిధులు లేవన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు….సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పుతారని గురాన అయ్యలు అన్నారు.

Related posts

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

Satyam NEWS

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

చిత్తూరు వైకాపాలో చిచ్చుపెట్టిన పదవుల పందారం

Satyam NEWS

Leave a Comment