తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు.
శనివారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన సమావేశంలో ఎంపిపి శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఎన్నిక నియామక పత్రాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గూడెపు శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ను రవీందర్ రావు అభినందించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్