40.2 C
Hyderabad
April 29, 2024 18: 08 PM
Slider విశాఖపట్నం

గంజాయి సాగుపై ఏపీ డీజీపీ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

#DGP

ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి సాగు పై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. విశాఖ లో పరివర్తన కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని మారు మూల పల్లెల్లో కొన్ని దశాబ్దాలుగా గంజాయి అక్రమసాగు కొనసాగుతుందోన్నారు.

పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. గంజాయి ని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామన్నారు.. డీజీపీ గౌతమ్ సవాంగ్. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారని…అన్ని విధానాలు,మార్గాల ద్వారా వాళ్ళు గంజాయి రవాణా చేస్తున్నారన్నారని డీజీపీ నొక్కి చెప్పారు.

మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారని…దాని ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారని రాష్ట్ర పోలీసు బాస్ తెలిపారు. ఓడిషా రాష్ట్రంలో 23 జిల్లాలో,విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగు అవుతుందని డీజీపీ తెలిపారు.

ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేసాం…చేస్తునే ఉంటామన్నారు.గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు గంజాయి సాగు ను ధ్వంసం చేసారని.. నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేసామన్నారు.

ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేసామన్నారు. ఇప్పటి వరకు 47వేల 987 కిలోల గంజాయి స్వాదినం చేసుకున్నామని తెలిపారు. 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధినం చేసుకున్నామని ,314 వాహనాలు సీజ్ చేసామని చెప్పారు.ఇతర రాష్ట్రాల కు చెందిన 154 మంది స్మగ్లర్లు తో పాటు కొత్తగా 300 మందిపై పై కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచామని పోలీసు శాఖ అధిపతి స్పష్టం చేసారు.

ఇక నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేసామని అలాగే 2 లక్షల కేజీల గంజాయి తగలు పెడుతున్నామని చెప్పారు. ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుందని…ఏజెన్సీలో మార్పు మొదలైందని పోలీసు శాఖ బాస్ స్పష్టం చేసారు.గిరిజనుల గంజాయి సాగు వైపు వెళ్లకుండా 1963 అవగాహన కార్యక్రమాలు 93 ర్యాలీలు నిర్వహించామని తెలిపారు.

గిరిజనుల కు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళే లా చేసామన్నారు. గంజాయి ఇప్పుడు హషిష్ ఆయిల్ రూపంలో కొత్త రూపం తీసుకుందని డీజీపీ చెప్పారు. దాని మీద కూడ తమ శాఖ ఉక్కపాదం మోపుతున్నామని డీజీపీ సవాంగ్ స్పష్టం చేసారు. పోలీసులు గంజాయి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదన్నారు. సరైన సమాచారం విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇది చాల బాధాకరమని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవేదన వ్యక్తం చేసారు.

Related posts

భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మరో కొత్త డ్రామా…! 

Satyam NEWS

నన్ పై అత్యాచారం కేసులో బిషప్ నిర్దోషి

Satyam NEWS

భద్రాచలం – పాల్వంచల మధ్య రాకపోకలు నిలిపివేత

Satyam NEWS

Leave a Comment