37.2 C
Hyderabad
May 2, 2024 14: 37 PM
Slider కరీంనగర్

బీజేపీని వీడిన కరీంనగర్ జిల్లా మహిళా నాయకులు

#ministerharishrao

బీజేపీ కరీంనగర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజురాబాద్ పట్టణ మహిళామోర్చ అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం నాడు  రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షులు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో వారిద్దరూ టీఆరెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు విధించిందని, కానీ టీఆరెస్ పార్టీ ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఉద్యోగ నియామకాల విషయంలో ఈ డబ్ల్యూ ఎస్  అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిందని తెలిపారు.

అలాగే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినందున  బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కేంద్రం పెట్రోలు, డీజిల్, ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని, అలాగే బడుగు బలహీన వర్గాలకు చేసిందేమి లేదని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్  విజయం కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు.

Related posts

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ హరితహారం

Satyam NEWS

మరో లాక్‌డౌన్.. సీఎంలతో ప్రధాని భేటీ

Sub Editor

తప్పుడు కేసులతో సతమతమవుతున్న జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment