26.7 C
Hyderabad
May 3, 2024 08: 55 AM
Slider ముఖ్యంశాలు

Tragedy TDP: తొక్కిసలాటలో ముగ్గురు మృతి

#guntur

నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది మరణించిన సంఘటన మరువక ముందే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మరో సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో నేడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.  పలువురు అస్వస్థతకు గురైయ్యారు. వారిని గుంటూరు జీజీహెచ్‌, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఒకరు గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Related posts

రుణ మాఫి అమలు చేయాలి

Bhavani

అవినీతి పుట్ట వాలంటీర్ వ్యవస్థ: ఈ మాట అన్నది మనం కాదు

Satyam NEWS

మహిళలు జగన్ ప్రభుత్వంపై తిరగబడాలి

Bhavani

Leave a Comment