విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ నెల 15, 16 తేదీలలో జరగనున్న జాతీయ సదస్సునకు ఎంపికయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మార్ట్ గ్రామ పంచాయతీల సాధికారితపై జరగనన్న సదస్సునకు రాష్ట్రం నుంచి ముగ్గురు సర్పంచ్లను ఎంపిక చేయగా, వారిలో ఒక్కరు నిడమానూరు సర్పంచ్ కావడం విశేషం. గతంలోనూ రెండు జాతీయ స్థాయి కార్యక్రమాలకు సర్పంచ్ రంగారావు ఎంపికైన విషయం విధితమే. ఈ నెల 14న రాష్ట్ర బృందం విజయవాడ నుంచి బయలుదేరి. లక్నో వెళ్లనుంది.
previous post