కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కేసులు విజృంభించడంతో పాటు.. ప్రముఖులకు కూడా సోకుతోంది. కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ వివిధ ధించింది…జగన్ ప్రభుత్వం.
గత రాత్రి నుంచీ కర్ఫ్యూ అమలు ప్రారంభమైంది. ఈ పరిస్థితి ల్లి విజయనగరం జిల్లా కేంద్రంలో అర్థరాత్రి కర్ఫ్యూ పరిస్థితి ని ఏఎస్పీ సత్యనారాయణ రావు అకస్మాత్తుగా పరిశీలించారు.
నగరంలో రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ నగర్ కాలనీ వద్ద కర్ఫ్యూ పరిస్థితి ని పరిశీలించారు. అక్కడే రయ్య్ రయ్య్ అంటూ దూసుకెళుతున్న మారుతీ కారును తన సిబ్బంది తో ఆపించారు…ఏఎస్పీ.
కరోనా పరిస్థితి, దానిపై తీసుకుంటున్న చర్యలు, పెరుగుతున్న కేసులు మృత్యువాత పడుతున్న సంఖ్య ను వాహనదారులకు తెలియజేసారు.
అక్కడికక్కడే వాళ్ళ చేత ప్రమాణం చేయించారు. ఏదైనా ఈ కరోనా సెకండ్ వేవ్ ఏ ఒక్కరినీ వదిలేటట్టు లేదు.