నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్వయంగా ఏలూరు నగరంలో పెట్రోలింగ్ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ నగరం లో పనిచేస్తున్న డి.ఎస్.పి లు, సిఐలు ఎస్ఐలు వారివారి పెట్రోలింగ్ వాహనాలలో నగరం మొత్తం పెట్రోలింగ్ నిర్వహించారు.
10 గంటలు దాటిన తర్వాత వాహనాల్లో తిరుగుతూ ఉన్న వారిపై జిల్లా ఎస్పీ నేరుగా కేసులు నమోదు చేశారు.
ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్లో జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి కవాతు నిర్వహించారు.
నాలుగు కార్లు రెండు ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మహా నగరాలను తలపించే విధంగా ఏలూరు నగరంలో ప్రస్తుతం జిల్లా ఎస్పీ సారథ్యంలో పోలీసింగ్ నిర్వహించారు అనడంలో అతిశయోక్తి లేదు.