“బస్తీలో బిఆర్ఎస్” కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట నియోజకవర్గం లో అంబర్ పేట నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి పర్యటించారు. కొత్త దుర్గా నగర్ స్లం ఏరియా లో బస్తీ నివాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను గురించి వారికి వివరించారు. ప్రభుత్వం తరఫున సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్తీలో పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి చదువుల విషయంలో “సయోధ్య” ద్వారా అదనపు ట్యూషన్లు నిర్వహించి వారిని చదువులో ముందంజలో ఉండేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సత్యం న్యూస్, అంబర్పేట్