అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బిజెపి నేడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిగింది.
నిరసన దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర ,జిల్లా నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. LRS ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య ,కృష్ణ గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మె రాజు,
జిల్లా ఉపాధ్యక్షుడు కమల్నాయన్ పడల రాజశేఖర్, తలోడు శ్రీనివాస్,బాలాజీ పటేల్ ,జిల్లా కార్యదర్శులు గాదె విలాస్ మిట్టపెళ్లి రాజేందర్,లక్ష్మణ్ ,గంగ భూషణ్ ,
దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్, బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనుముల శ్రావణ్ ,పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్,
బిసి మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లేష్ , ఎస్ టి మోర్చాజిల్లా అధ్యక్షుడు టెకం బింరావు నాయకులు సాదం అరవింద్, నాయిని సంతోష్ , కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి , అల్లం భాస్కర్ ,
మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.