31.7 C
Hyderabad
May 2, 2024 09: 17 AM
Slider ఆదిలాబాద్

ఆపద సమయంలో ఆకలి తీర్చడం అభినందనీయం

Nirmal SP 151

ఆహారం కోసం ఆరాటపడుతున్న వారికి ఆపద సమయంలో ఆకలి తీర్చడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. కంబైన్డ్ ఆటోమోటివ్స్ జాన్ డీర్, టాటా మోటార్స్ వారి ఆధ్వర్యంలో బుధవారం గంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్ లకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎస్పి హాజరై మాట్లాడారు.

లాక్ డౌన్ ప్రభావంతో జాతీయ రహదారిపై ప్రయాణించే డ్రైవర్ల కు  ఆహారం లభించక నానా అవస్థలు పడుతునందున కంబైన్డ్ ఆటోమోటివ్స్ యాజమాన్యం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల డ్రైవర్లకు ఉపశమనం కలిగిందని ఇంకా ఎవరైనా దాతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సొన్ సీఐ జీవన్ రెడ్డి, కంబైన్డ్ ఆటోమోటివ్స్ యాజమాన్యం,  సొన్ ఎస్ఐ రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

Satyam NEWS

బాదితులకు సత్వర న్యాయం చేయాలి

Bhavani

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment