TUWJ-H143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టుల మహాసభ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్ లో జరుగుతుందని TUWJ-H143 వనపర్తి జిల్లా అధ్యక్షుడు పోతుల రాము తెలిపారు.ఈ మహాసభలకు TUWJ- H143 రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్,సయ్యద్ ఇస్మాయిల్ తో పాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,వి. శ్రీనివాస్ గౌడ్ లతో పాటు వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.నాగర్ కర్నూల్ లో జరిగే ఈ మహాసభలకు వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల నుండి జర్నలిస్టులు తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్