ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని ఆంధ్రప్రదేశ్ ఆయుష్ కమిషనర్ రాములు ప్రకటించారు.
ఆయుష్ ప్రతినిధుల సమక్షం లో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు. మందు తయారీ లో ఎలాంటి ప్రమాదకరమైన పదార్ధాలు లేవని నిర్ధారణ అయింది.
అయితే ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం మందు కాదని దాన్ని నాటు వైద్యంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
కళ్ళలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారని ఆయుష్ కమిషనర్ తెలిపారు.
ఆనందయ్య వాడుతున్న పదార్ధాలు హానికరం కాదు అని తాము నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు.
మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ- తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చాల్సి ఉందని ఆయన అన్నారు.
CCRAS ( సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది.
అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుంది.
రోగుల లో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది.
పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది. ప్రస్తుతానికి మందు తయారీపై ఆయుష్ పరిశీలన ముగిసింది.