28.2 C
Hyderabad
May 9, 2024 01: 22 AM
Slider తెలంగాణ

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

KCR_facebook_CMO

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి జరుపుతున్న వైద్య,ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.  ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించారు.

ఇన్సెంటివ్ ను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జామి శివాజీ ఆశ‌యాల్లో తాము అండ‌గా ఎమ్మెల్యే

Sub Editor

కొల్లాపూర్ లో ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు

Bhavani

తిరుమలలో పారాయ‌ణానికి 100 రోజులు

Satyam NEWS

Leave a Comment