కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి జరుపుతున్న వైద్య,ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించారు.
ఇన్సెంటివ్ ను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.