28.7 C
Hyderabad
April 26, 2024 08: 45 AM
Slider కడప

రాజంపేటలో క్లోరైడ్ ద్రావణం పిచ్చి కారి చేసిన అకేపాటి

Aakepati

కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్ వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధరెడ్డి క్లోరైడ్ ద్రావణం పిచ్చి కారి చేశారు. కరోనా కట్టడిలో భాగంగా శానిటేషన్ ఖర్చుల కోసం పట్టణ వైసీపీ నేత పోలా శ్రీనివాసులు రెడ్డి 50 వేల రూపాయలను అందజేశారు.

కాలేజీ గ్రౌండ్ లో కూరగాయల మార్కెట్ లో సందర్శించిన అకేపాటి అక్కడ జనం గుమికూడకుండా సోషల్ డిస్టన్స్ పాటించేలా సూచనలు చేశారు. కరోనా వ్యాపించకుండా కేంద్రం, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ కమిషనర్ రాజశేఖర్, డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, రాజంపేట రోటరీ క్లబ్ సెక్రెటరీ లాయర్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా రోటరీ క్లబ్ కోశాధికారి హరినాథ్ చౌదరి, రోటరీ క్లబ్ పీఆర్వో మహేశ్వర్ పోలి వేణు, విశ్వనాథ్ రెడ్డి, డి.సి.యం.యస్.చైర్మన్ దండు గోపి, పోలి మురళి, నాగేశ్వర్ నాయుడు, సుబ్బారాయుడు, జీవి సుబ్బరాజు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభలకు మీరు రావాలి…!

Satyam NEWS

విద్యల నగరంలో గంజాయి…..!

Bhavani

ముంపు బాధితులను అండగా ఉంటాం

Bhavani

Leave a Comment