నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు కదిరేపాడ్ కృష్ణయ్య అధ్యక్షతన BSP జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి 67వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా BSP రాష్ట్ర మైనార్టీ కన్వినర్ మౌలానా షఫి మాసూద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాయావతి ఈ దేశ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
ఆమె UP ముఖ్య మంత్రి అయినప్పుడు లక్షలాది ఎకరాల భూమిని పంచడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో మాయావతి కి మాత్రమే ఉన్నదని అన్నారు. నేడు దేశం BJP హయాంలో క్లిష్ట పరిస్థితి లో ఉన్నదని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే నాయకురాలు ఈ దేశంలో ఒక్క మాయావతి మాత్రమే అని చెప్పారు.
ప్రజలందరూ మాయావతి ని స్ఫూర్తిగా తీసుకొని ఆమె బాటలో నడవాలని పిలుపునిచ్చారు. నేడు తెలంగాణాలో మాయావతి పాలన తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్నారని, అందుకు అనుగుణంగా నియోజకవర్గం లో ఉన్న నాయకులు పార్టీని గ్రామాలలోకి తీసుకొని వెళ్లి నిర్మాణం చేప్పటాలని చెప్పారు.
అంతకు ముందు టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి మరియు కొల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ గగనం శేఖరయ్య,జిల్లా కోశాధికారి బ్రహ్మయ్య, జిల్లా కార్యదర్శి కేశపాగా వెంకటేష్, అసెంబ్లీ ఇంచార్జ్ వెంకటేష్ నాయుడు, అసెంబ్లీ మహిళా కన్వినర్ విద్యారాణి, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు మునిస్వామి, వివిధ మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.