తెలంగాణ రాష్ర్ట సమితి సీనియర్ నేత, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అనారోగ్యంతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. నోముల ఆకస్మిక మరణంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నోముల మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన అందించిన సేవలు విశిష్టమైనవని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి నోముల అని కొనియాడారు.
previous post
next post