అసలే అధికార పార్టీ.ఆపై స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం అందునా..ఆ పార్టీకి చెందిన అభ్యర్ధి నామినేషన్ పర్వం. ఇంకేముంది..కలేక్టేరట్ ప్రాంగణం అంతా హాడావుడితో కోలాహలంగా మారింది.
ఈ కరోనా కాలం…ఆపై ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని..లేకపోతే 100 జరీమానా అన్న నిబంధన. వీటిని ఏమీ పట్టించుకోకుండా ఊరేగింపుగా ఒకే ఒక అదీ కూడా స్థానిక సంస్థల అభ్యర్ధి ఎస్.కోటకు చెందిన రఘురామరాజును అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల, గజపతినగరం, విజయనగరం కు చెందిన ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు,బొత్స అప్పల నరసయ్య, కోలగట్ల వీరభద్ర స్వామిలు..ఊరేగిపుంగా కలక్టరేట్ కు వచ్చారు.
ఇన్ గేట్ వద్ద దిశ డిఎస్పీ త్రినాధ్..ఎస్టీఎఫ్ సిబ్బందితో పాటు వన్ టౌన్,టూటౌన్ సీఐలు మురళీ,లక్ష్మణరావులతో బందోబస్తు నిర్వహించి..కేవలం ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ అభ్యర్ధిని మాత్రమే లోపలకు అనుమతించారు.దీంతో ఎలాంటి నినాదాలు చేయకుండానే..జాయంట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ను కలిసి నామినేషన్ పత్రాన్ని ఇచ్చారు.
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,జెడ్సీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్ధి రఘునాధరాజు..తన నామినేషన్ పత్రం ఇచ్చారు.అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోమీడియాతో మాట్లాడారు.సీఎం జగన్ ఆశయాలకనుగుణంతో పాటు స్థానికంగాప్రజల మద్దుతుతో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాననిచెప్పారు