39.2 C
Hyderabad
May 3, 2024 14: 54 PM
Slider గుంటూరు

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

#chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ, మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడ పర్యటనపై పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, వెనిగండ్ల రాముతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.  అంబేద్కర్ జయంతిని గుడివాడలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 12న మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

Related posts

సిఎం సహాయ నిధి చెక్కులు పంచిన ఎమ్మెల్యే

Satyam NEWS

గ్రాండ్ గా “రుద్రవీణ” ప్రి రిలీజ్..ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్

Bhavani

జగజ్జనని

Satyam NEWS

Leave a Comment