38.2 C
Hyderabad
May 1, 2024 19: 05 PM
Slider నల్గొండ

ఘనంగా నందమూరి తారక రాముని వర్ధంతి

#hujurnagar

పేదల పెన్నిధి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ యుగపురుషుడు అని రెండు,రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల దేవుడుగా నిలిచాడని తెలుగుదేశం పార్టీ నేతలు కొనియాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నందమూరి తారక రామారావు 27వ, వర్ధంతి సందర్భంగా పట్టణం లోని ఇందిరా సెంటర్ లో ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణి నాయకులు మాట్లాడుతూ హరిజన, గిరిజన,తాడిత,పీడిత వర్గాల కొరకు ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశాడని అన్నారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం,మొట్ట మొదటగా 30 రూపాయల పింఛను ప్రవేశపెట్టి గొప్ప ప్రజా రంజకమైన పరిపాలన అందించాడని అన్నారు.ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు, టిఎన్టియుసి రాష్ట్ర నాయకుడు శీతల రోశపతి,మాజీ ఎంపిపి ఆళ్ల భాగ్యమ్మ చౌదరి,కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మీసాల సైదులు,బిసి సెల్ రాష్ట్ర నాయకుడు ఎలక వెంకటేశ్వర్లు గౌడ్,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు ఉండేటి సతీష్,బిసి సెల్ రాష్ట్ర నాయకుడు గుండు వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వల్లపు దాసు కోటయ్య గౌడ్,తెలుగు యువత పార్లమెంటు నాయకులు చంద్రగిరి సాంబ,మేకల వెంకటేశ్వర్లు,పార్టీ సీనియర్ నాయకులు రాములు,ఆళ్ల కోటయ్య,ఐల వెంకన్న గౌడ్, సుధీర్, శ్రీకాంత్,నకిరేకంటి నాగరాజు,రాయిరాల అనిల్, పెండెం అంజయ్య గౌడ్,అనంతు సైదులు,నరసింహారావు,పసుపులేటి సీతారాములు,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని బిజెవైఎం డిమాండ్

Satyam NEWS

పండుగ రోజు తిండి ముట్టకూడదని రైతుల నిర్ణయం

Satyam NEWS

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

Satyam NEWS

Leave a Comment