సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపలసింగారం గ్రామంలోని గర్భిణి స్త్రీలకు నేడు పౌష్టికాహారం పంపిణీ చేశారు. మిట్టగూడెం అంగన్వాడీ నెం4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష కొండారెడ్డి పాల్గొన్నారు. ముందుగా మొక్కలను నాటి ఆమె హరిత హారాన్ని ప్రారంభించారు.
అనంతరం గర్భిణీ స్రీలకు పౌస్టికాహారం బాలామృతం, కోడిగుడ్లను పంపిణిచే సి, గర్భిణీ స్త్రీలు ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకుంటూ జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PHN ప్రమీల, ఏఎన్యం స్వరూప, ఆశావర్కర్ జాన్భీ, అంగన్వాడి టీచర్ అవనిజ, జైనాభీలు పాల్గొన్నారు.