38.2 C
Hyderabad
April 29, 2024 20: 48 PM
Slider ముఖ్యంశాలు

లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

#chief secretary

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందు కు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.  హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడుభూములు, తెలంగాణ కు హరితహారం, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఇంటర్ పదవ తరగతి పరీక్షలు, ఐడిఓసి పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. కంటి వెలుగు అంశం పై సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 86.5 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 14.23 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 10.37 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేయగా, జిల్లాలకు 5 లక్షలకు పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్ తెలిపారు. జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలపై ప్రజలలో మరింత విస్తృత ప్రచారం కల్పించాలని, రిఫరల్ ఆసుపత్రిలో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని, మహిళలకు పూర్తి చికిత్స ప్రాధాన్యతతో ఉచితంగా అందిస్తామని అన్నారు. భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతి పై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్  పట్టాలను మార్చి చివరి నాటికి పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ రుసుము వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 76 కు సంబంధించి పెండింగ్ లో ఉన్న రుసుంను వసూలు చేసి పట్టాల పంపిణీ మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించిన 1039 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నాయని, వీటి ల్యాండ్ స్కెచ్ ఇంటి పట్టాల వారిగా సరిహద్దులతో వివరాలు, ఇంటి నిర్మాణానికి అనుకూలత వంటి అంశాల పై నివేదిక అందించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపులో పురోగతి ఉందని సీఎస్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 322 ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేశామని, మరో 9 వేల 411 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక  ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.

పోడు భూముల పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభం అవుతుందని పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అగ్ని ప్రమాధాల నియంత్రణ కు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో సైతం అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  జిల్లాలో జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో , పెద్ద అపార్ట్మెంట్, షాపింగ్ మాల్స్ ఫైర్ సెఫ్టీ ఉండాలని అన్నారు. అగ్ని ప్రమాధాల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని, అలసత్వం వహించవద్దని అన్నారు.జిల్లాలో ఫైర్ సేఫ్ట కోసం ఆడిట్ నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించుకున్న సమీకృత కలెక్టరేట్ లలో  జిల్లాలలో మార్చి చివరి నాటికి ప్రైవేట్ బిల్డింగ్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేసి షిఫ్ట్ కావాలని, తదుపరి రెంటల్ బడ్జెట్ ఉండదని సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైకుంఠ దామం నిర్మాణం పూర్తి చేసామని వాటిని వినియోగంలోకి తీసుకోని రావాలని, వైకుంఠదామాలో విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా సౌకర్యం కల్పన పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలకు నిర్దేశించిన బృహత్ పల్లె ప్రకృతి వనాల, పల్లె ప్రకృతి వనాల లక్ష్యాలు పూర్తి చేయాలని,   రానున్న వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎస్ అన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం జరిగేలా కృషి చేయాలని అన్నారు. జిల్లాలకు నిర్దేశించిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు.

Related posts

పేదల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి

Bhavani

కరోనాతో జాగ్ర‌త్త ఆరోగ్యం మన చేతుల్లోనే

Sub Editor

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment