ఖమ్మం జిల్లా సెర్ఫ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఐడిఓసి లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనస్కెలు వర్తింపజేస్తూ మార్చి 18 న ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సంతోషాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ కలెక్టర్ తో పంచుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరింత బాధ్యతగా, మెరుగ్గా పనిచేసి శాఖకు మంచిపేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో విద్యాచందన, ఏపీడి జయశ్రీ, డిపిఎం రేవతి, దర్గయ్య, సెర్ఫ్ యూనియన్ల అధ్యక్షులు జి. చిన్న వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సుభద్ర, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, తిరుమల రావు, పుల్లారావు, హరికృష్ణ, భాస్కర్, లక్ష్మణ్ రావు, పెద్దపాక వెంకటేశ్వర్లు, మోహన్, వెంకట రామారావు, రాయల శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.