ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్.జి రాం (80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్. జి రాం జగిత్యాలలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్. జి రాం వ్యాపారవేత్తగా జగిత్యాల ప్రజలకు సుపరిచితులు.
ఆయన ఆకస్మిక మరణం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు శోకసంద్రం లో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ పార్టీల నాయకులు పార్థవదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.