42.2 C
Hyderabad
May 3, 2024 19: 00 PM
Slider జాతీయం

ఆల్ సేఫ్ :పడవ బోల్తా 25మందిని కాపాడిన ఈతగాళ్లు

odisha boat accsident swimmers save 25 members

25మంది ప్రయాణికులున్నపడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ఘటనలో పక్కన ఉన్న పడవల్లో ప్రయాణిస్తున్న ఈతగాళ్లు స్పందించి కాపాడిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా జిల్లా చిలికా సరస్సులో జరిగింది. 25మంది ప్రయాణికులతో కూడిన పడవ కాళీజైకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ పడవ సరస్సులో మునిగింది. పడవ మునగడంతో తోటి పడవల్లో ఉన్న ఈతగాళ్లు 25 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 25 మందిని చికిత్స కోసం బాలుగామ్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బెర్హంపూర్ నగరంలోని ఎంకేసీజీ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు

Related posts

నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

Satyam NEWS

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

Bhavani

Leave a Comment