37.2 C
Hyderabad
May 1, 2024 14: 46 PM
Slider వరంగల్

కరోనా తో ములుగు విద్యాశాఖ సూపరింటెండెంట్ మృతి

#mulugu dist

ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ వాజిద్ హుసెన్ కరోనాతో మరణించారు. వాజిద్ సుసెన్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు.

సయ్యద్ వాజిద్ హుస్సేన్ గారు ఖమ్మం జిల్లా లో పని చేస్తూ సూపరింటెండెంట్ ప్రమోషన్ పై ములుగు వచ్చారు. దాదాపు 14 నెలలు గా ఆయన ములుగులో చిత్తశుద్ధితో విధులు నిర్వహించారు. అయితే ఆయన కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

కరోనా వ్యాధితో చికిత్స పొందుచూ 22న రాత్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెల్సిన ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ సిబ్బంది విచారం వ్యక్తం చేసి 2నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమములో కార్యాలయ సిబ్బంది సుదర్శన్ రెడ్డి, జి. సాంబయ్య, ఎ. రాజు, రమాదేవి, S. కిరణ్ కుమార్, Md. నూరుద్దిన్, ఎ. భద్రి ప్రసాద్, మంజుల, మార్జఫిరసత్ హాసన్, ఎ. భరత్, కిరణ్ కుమారి, సమ్మయ్య పాల్గొన్నారు.

Related posts

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

Bhavani

మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది

Satyam NEWS

మాజీ రేషన్ డీలర్ కు ఉచిత వైద్యం చేసిన చదలవాడ

Satyam NEWS

Leave a Comment