29.7 C
Hyderabad
May 3, 2024 04: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్

ట్రాజెడీ: రాజధాని కోసం ఆగిన మరో గుండె

amaravathi

అమరావతి రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో మనస్థాపంతో రాలుతున్న గుండెలు ఎక్కువవుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని మనస్థాపం చెందిన ఒక వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లాలోని నేలపాడులో ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది రోజులుగా రాజధాని పై ఆవేదన చెందుతున్నది.

మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 31వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

Related posts

గజ్జి మల్లికార్జున్ కు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు

Satyam NEWS

దొరికిన బ్లాక్ బాక్స్.. ఘటనపై కీలాకాధారాలు లభ్యం

Sub Editor

పంచాయితీ నిధుల మళ్లింపుపై హైకోర్టులో కేసు దాఖలు

Satyam NEWS

Leave a Comment