విశాఖ నగరంలో సుమారు కోటి రూపాయలు నగదును పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ద్వారకా నగర్ వద్ద సుమారు కోటి రూపాయలు నగదు ఉండగా అనుమానంతో చెక్ చేసి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో ద్వారకా నగర్ పోలీసులు ఈ తనిఖీ చేపట్టారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ద్వారక సి.ఐ, పోలీసులు సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులతో పాటు నగదు సీజ్ చేసి ద్వారక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
previous post