31.7 C
Hyderabad
May 7, 2024 02: 41 AM
Slider మహబూబ్ నగర్

Tragedy: పిడుగుపడి రైతు దుర్మరణం

#ThunderBolt

పిడుగుపాటుకు వెకంటేశ్(21) అనే రైతు చనిపోయాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో శుక్రవారం జరిగింది.

రాజోలి మండల కేంద్రానికి చెందిన కురవ ఈదన్న రెండో కొడుకు వెకంటేశ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం డింది.

దీంతో పిడుగుపడి వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే వెంకటేశ్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం వెంకటేశ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

నిరుపేద వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని రాజోలి ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts

ఎలారమింగ్: కట్టు దాటి పోతున్న కరోనా వైరస్

Satyam NEWS

దిగులు మేఘం

Satyam NEWS

హైదరాబాద్ ను ముంచేసిన భారీ వర్షం

Satyam NEWS

Leave a Comment