తూర్పుగోదావరి కొత్తపేట ప్రాంతంలోని ఆత్రేయపురం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. లొల్ల లాకుల వద్ద పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది.
కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. కారులో ఉన్న మరో ఇద్దరు మాత్రం సురక్షితంగా ఉన్నారు.
మృతుడు పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరు కు చెందిన సిహెచ్ శ్రీనివాసరాజుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దేవాలయానికి వీరంతా వచ్చినట్టు సమాచారం.