26.7 C
Hyderabad
May 3, 2024 09: 21 AM
Slider విజయనగరం

జనసేవతోనే జనసేన విజయం సాధించడం ఖాయం

#janasena

జనసేవతోనే జనసేన విజయం సాధించితీరుతామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పాలవలస యశస్వి అన్నారు.

స్థానిక అయ్యన్నపేట, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పాలవలస యశస్వి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఒక ఆశయంతో,పార్టీ సిద్ధాంతాలతో,నవతర రాజకీయానికి శ్రీకారం చుట్టారని,అందుకే పవన్ కళ్యాణ్ జనసేనలో సేవాదల్ విభాగాన్ని పెట్టి తన అభిమానులకు సేవాదల్ ద్వారా రాజకీయ ఒరవడిని తీర్చిదిద్దారని అన్నారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా ప్రజల్లోమమేకమైన,  సేవాకార్యక్రమాలతో ప్రజల్లోకి వెల్తూ అధినేత ఆశయాలతో ముందుకెళ్తామని,ప్రజలపక్షాన ఎల్లప్పుడూ నిలుస్తూ జనసేవతోనే జనసేన విజయం సాధించి తీరుతుందని అన్నారు.

మరో అతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ జనసేన పార్టీ విలువైన, గౌరవప్రదమైన రాజకీయాలకోసం, పాతికేళ్ల యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీపుట్టిందని, అధినేత మార్గంలో నడుస్తూ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనకరమైన వైద్య శిబిరాన్ని పెట్టడం చాలా అభినందనీయమని అన్నారు.

పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ నేత్రవైద్య శిబిరంలో సుమారు రెండు వందలమంది ప్రజలు తనిఖీలు చేయించుకున్నారని,అందులో పదహారు మందికి ఆపరేషన్లు ఉచితంగా ఈనెల 31 నిర్వహిస్తామని పుష్పగిరి కంటి ఆసుపత్రి పి.ఆర్.ఓ. సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళలు,రాష్ట్ర చేనేతకార్మిక విభాగ కార్యదర్శి కాటం అశ్వని, తుమ్మి లక్ష్మీ రాజ్,జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్,చెల్లూరి ముత్యాల నాయుడు, కారి రాజేష్ బాబు,రఘు,రాముల కిరణ్,రవిరాజ్ చౌదరి,లోక్నాధ్, అలబొయిన  శివగణేష్ కృష్ణ,అమ్మినాయుడు,కిలారి పటాస్, బాబురావు,సంతోష్,  తదితరులు పాల్గొన్నారు

Related posts

వడ్లు కొనకుంటే ఉద్యమం తప్పదు: టిఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత సమావేశం

Satyam NEWS

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గౌడ సంఘం హెచ్చరిక

Satyam NEWS

మూడు రాజ‌ధానుల‌కే జగన్ ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంది

Satyam NEWS

Leave a Comment