విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం విశాఖ – అరకు రహదారిలో దేశపాత్రునిపాలెం వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో – బైక్ ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.
మృతుడు కొత్తవలస మండలం వీరభద్రపురం పంచాయతీ నరపాం గ్రామానికి చెందిన కన్నబాబు (బ్యాండ్ మాస్టర్) గా గుర్తించారు. కొత్తవలస నుంచి వస్తున్న ఆటో విశాఖ నుంచి వస్తున్న బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బైక్ పై వెళ్తున్న కన్నబాబు మృతి చెందగా, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బయిలపూడి కన్నబాబు వయసు నలభై నాలుగు సంవత్సరాలు మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
next post