27.7 C
Hyderabad
April 30, 2024 10: 08 AM
Slider ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మరో యువతి అనుమానాస్పద మృతి

#NavyaReddy

ఖమ్మం జిల్లాలో మరో యువతి అనుమానాస్పదంగా మరణించింది. నవ వధువు నవ్య అనుమానాస్పద మరణంతో దిగ్భ్రాంతి చెందిన అదే కుటుంబానికి చెందిన మరో యువతి మరణించడం మిస్టరీగా మారింది.

ఎర్రుపాలెం మండలం లోని అయ్యవారిగూడెం  గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నవ్య(22) మూడు రోజులక్రింద మిస్ అయి తర్వాత పెనుబల్లి మండలం లోని కొత్తలంక పల్లి గ్రామం వద్ద శుక్రవారం విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.

 పెగళ్ళపాడు గ్రామానికి చిన్న నాగశేషి రెడ్డి(27)తో గత డిసెంబర్ 9న ఆమెకు వివాహం జరిగింది. భర్తే అమెను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి మత్తు మందు కలిపి ఇచ్చి ఆ తర్వాత హత్య చేసినట్లు సిసి టివిలలో రికార్డు అయింది.

ఇప్పుడు తొండల గోపారం -పగిళ్లపాడు గ్రామాల  మధ్యలో వెనీలా అనే యువతి రైలు కింద పడి మరణించి ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదా లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా అనే విషయం స్పష్టం కాలేదు.

శుక్రవారం జరిగిన హత్య కు సంబంధించిన వ్యక్తి కి, ఈ యువతి బంధువులు కావడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నవ్య భర్త నాగ శేషు రెడ్డికి వెనీలా బంధువే కాకుండా ఇద్దరూ ఒకే ఊరికి చెందిన వారు. నవ్య హత్య గురించి కేసు దర్యాప్తు జరుగుతుండగానే మరో మరణం జరగడం సంచలనం కలిగిస్తున్నది.

Related posts

సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్న వైసీపీ రౌడీలు

Satyam NEWS

ధరల పెంపుపై బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం

Satyam NEWS

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం సిఐటీయూ బైక్ ర్యాలీ

Sub Editor

Leave a Comment