38.2 C
Hyderabad
April 29, 2024 20: 03 PM
Slider గుంటూరు

సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్న వైసీపీ రౌడీలు

#chadalawada

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో స్థానిక నవయుగ కన్వెన్షన్ లో ఆదివారం నాడు ఐటీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం విస్తృత స్థాయిలో నిర్వహించారు. ఈ సమావేశానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంలో ఐటీడీపీ నాయకులు ఇంకా చురుగ్గా వ్యవహరించాలని ఐటీడీపీ నాయకులకు సూచించారు.

సోషల్ మీడియా వేదికగా నరసరావుపేట అవినీతి చక్రవర్తి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతి,అక్రమాలను ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు. అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ పై విషం చిమ్మే వైసీపీ సోషల్ మీడియా రౌడీలకు దీటుగా సమాధానం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐటీడీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గాలు ప్రజలకు తెలియచేసి ప్రజలను అప్రమత్తం చేయాలి అన్నారు.

ఐటీడీపీ నాయకులు దైర్యంగా పోరాడాలని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. అనంతరం ఐటీడీపీ టీ-షర్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్ట కిరణ్,నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేట ఏరియాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

Satyam NEWS

తెలంగాణ యాపిల్ ఎంత తియ్యగా ఉందో

Satyam NEWS

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS

Leave a Comment