హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో ఆయన చేరాడని, ఆయన మరణించిన తరువాత కరోనా వచ్చినట్లు తెలిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
అదే విధంగా తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయినట్లు మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం ప్రభుత్వానికి అందించాలని మంత్రి కోరారు. ఈ రోజు కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణ లో ఇప్పటి వరకు 65 కు కరోనా కేసులు చేరాయని మంత్రి తెలిపారు.